12-01-2025 12:00:00 AM
బి.మహేశ్ కుమార్ గౌడ్ :
పవిత్రమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాల్సిన సమయంలో బీజేపీ పాలకుల ఒంటెత్తు పోకడలతో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. మనుస్మృతిని ఆరాధించే బీజే పీ నేతలు రాజ్యాంగ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
దేశం కోసం బలిదానాలు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, లౌకికవాదం, ఐక్యత కోసం పోరాడుతోంది. పవిత్రమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఈ శుభ తరుణంలో నియంతృత్వ బీజేపీ పాలనలో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడానికి పోరాడాల్సిన ఆవశ్యకత దేశం లోని లౌకికవాదులపై, ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, దాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినా శిక్షించకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెనకేసుకొని రావ డం శోచనీయం. 2024 డిసెంబర్ 26న బెళగావిలో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ (సీడబ్ల్యుసీ) సమావేశాల్లో బీజేపీ తీరుకు వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మహాత్మాగాంధీ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు అనేకమంది తమ జీవితాలను పణంగా పెట్టి నిస్వార్థంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే, బీజేపీ పాలకుల చేతిలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లింది.
జాతిపిత మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో యావత్ దేశం అహింసా మార్గంలో ఉద్యమాలు చేసి సాధించిన స్వతంత్ర దేశంలో పది సంవత్సరాల ఏడు నెలల నరేంద్ర మోదీ నేతృత్వం లోని ఎన్డీఏ పాలనలో దౌర్జన్యాలు, హింస తో లౌకికవాదం ప్రశ్నార్థకమైంది.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన రాజ్యాం గంపై, దాని రూపకర్త డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్పై రాజకీయ కుట్రలకు తెరలేపి బడు గు, బలహీన, మైనార్టీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలను బీజేపీ సృష్టిస్తోంది. నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందిపాలు చేస్తున్న నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకతంగా మహాత్మాగాంధీ స్ఫూర్తి, సిద్ధాంతాల మార్గదర్శకం లో దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బెళగావిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కాం గ్రెస్ పార్టీ నిర్ణయించింది.
పవిత్రమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాల్సిన సమయంలో బీజేపీ పాలకుల ఒంటెత్తు పోకడలతో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. మనుస్మృతిని ఆరాధించే బీజేపీ నేత లు రాజ్యాంగ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
కీలక బాధ్యతలో ఉన్న అమిత్ షా బాధ్యతారహితంగా పార్లమెంట్ వేదికగా రాజ్యంగ నిర్మాత, కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల మనసులను గాయపరిచారు. భారత రాజ్యాంగాన్ని మార్చాల ని చూస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం పరిరక్షణకు బెళగావి వేదికగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శంఖారా వం పూరించింది.
రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తయ్యే 2025 జనవరి 26న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి, అదే స్ఫూర్తితో 2026 జనవరి 26 వరకు ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరా ల్లో నిర్వహించి బీజేపీ మెడలను వంచాల ని సీడబ్ల్యుసీ పిలుపిచ్చింది. ఈ కార్యక్రమాల్లో సకలజనులు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి.
బీజేపీ స్వయం ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా వంటి రంగాలపై ఒత్తిడి తెస్తూ రాజకీయాలను కలుషితం చేస్తోంది. ఏకపక్షంగా ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టడం బీజేపీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.
ఎన్నికల నిర్వహణలో సీసీ కెమెరాల వీడియోలు, వెబ్క్యాస్టింగ్ బహిరంగపర్చకూడదని ఎన్నికల కమిషన్ నిర్ణ యించడం దురదృష్టకరం. ఈ అంశంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల కమిషన్ ఇలాంటి చర్యలకు పూనుకోవడం గర్హనీయం.
బీజేపీ మతకలహాలను ప్రోత్సహిస్తోం ది. దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెరిగిపోవడంతో వారు అభద్రతకు లోనవుతున్నారు. మణిపూర్లో 2023 మే నెల నుండి అల్లర్లు కొనసాగుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో ఒక్కసారి కూడా పర్యటించలేదు. ఇటీవల మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై క్షమాప ణ చెబుతూ చెంపలేసుకున్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇంకా స్పందించలేదు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ యూపీ లోని సంభాల్లో మతకలహాలు సృష్టించింది. యూపీఏ ప్రభుత్వం 1991లో తీసుకొచ్చిన ప్రార్థనాస్థలాల చట్టాన్ని నీరుగారుస్తోంది. ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ను అసోం, యూపీ ప్రభు త్వాలు దౌర్జన్యంగా అడ్డుకున్నాయి.
జనాభా ఆధారంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో దేశంలో కులగణన చేపట్టి, గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలనేది కాంగ్రెస్ విధానం. ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్లపై ప్రస్తుతమున్న 50 శాతం సీలింగ్ నిబంధనను తొలగిస్తే అందరికీ సమ న్యాయం జరుగుతుంది. బీజేపీ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థతో నిత్యా వసరాల ధరలు పెరిగిపోయాయి.
మోదీ ప్రభుత్వం బడా వ్యాపారస్తులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీక రణ చేయాలని కుట్రలు పన్నుతోంది. రాబోయే బడ్జెట్లో పేదలు ఆర్థికంగా బలపడేలా, మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకొ ని, పేదల సంక్షేమానికి బడ్జెట్ పెంచడంతోపాటు జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి పన్ను విధానాలను సరళతరం చేయాలి.
దేశంలో వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నీరుగార్చింది.. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు చెల్లించి పేదలకు అండగా నిలవాలి.
విదేశీ వ్యవహారాల్లో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లడఖ్ సరిహద్దుకు సం బంధించి చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతోపాటు ఎల్ఏసీపై పార్లమెంట్లో చర్చించి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాక, బం గ్లాదేశ్లో మైనార్టీల రక్షణ కోసం భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ విజయవంతంగా నిర్వహించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన రాహుల్ గాంధీకి, ‘సంఘటన్ శ్రీజన్’ కార్యక్రమం చేపట్టేందుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ వాదులు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది.
అంబేద్కర్ ఆశయాలను, జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వా మ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో చేపట్టబోయే ‘జై బాపు’, ‘జై భీమ్’, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత సకలజనులపైన ఉంది.
వ్యాసకర్త టీపీసీసీ అధ్యక్షులు