30-05-2025 01:04:26 AM
గజ్వేల్ పట్టణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్
గజ్వేల్, మే 29: రాబోయే స్థానిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బిజెపి జెండా ఎగిరే విధంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బిజెపి పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పట్టణ నూతన కమిటీని బిజెపి రాష్ట్ర శాఖ, ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణ కమిటీ ని నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని, నియమనిబంధనలు పాటించాలన్నారు.
రాబోయే స్థానిక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బిజెపి జెండా ఎగిరే విధంగా ప్రతీ కార్యకర్త, ప్రతీ పదాధికారి క్రమశిక్షణతో పని చేయాలన్నారు. గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులుగా మైస విజయ్, వడ్డేపల్లి ప్రసాద్, చిన్నోజి నీరజ, సంగెం కరుణాకర్, బిజెపి గజ్వేల్ ప్రధాన కార్యదర్శిలుగా నాయని సందీప్ కుమార్, మాడ్గురి నరసింహ ముదిరాజ్, కార్యదర్శిలుగా కొన్నే రాజశేఖర్ రెడ్డి, తలారి రాజు ముదిరాజ్, చిక్కుడు ప్రసాద్, పంజాల శివకుమార్ గౌడ్, కోశాధికారిగా లింగంపల్లి హరికుమార్ లను నియమించి నట్లు తెలిపారు.
కార్యవర్గ సభ్యులుగా కదుల్లా దేవేందర్, మార్కంట్టి పోచయ్య, సంగెపు పరుశరాములు, పుర నర్సింలు గౌడ్, నాగులపల్లి పవన్ కుమార్, ద్దుద్దేడ గణేష్, మఠం ప్రమత్ నాథ్, గొల్లపల్లి కుమార్ లతోపాటు 35 మంది సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసినట్లు గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ తెలిపారు.