30-05-2025 01:03:02 AM
సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షలో
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మే 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎంపికను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పథకాల అమలుపై ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటి కలలు సాకారం చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.
నియోజకవర్గం వ్యక్తంగా 3500 ఇల్లు మంజూరు కాగా.. మొదటి విడతలో 1032 లబ్ధిదారులకు నిధుల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ రూ.50 వేల నుంచి రూ.4 లక్షల రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. జూన్ రెండున 50 వేలు, లక్ష రూపాయల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులందరికీ మంజూరు పత్రాలు అందజేయబోతున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియం చేసుకోవాలని కోరారు.
అనంతరం వివిధ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, జ్యోతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, జైత్రామ్ నాయక్, తహసీల్దార్ లు సంగ్రామ్ రెడ్డి, దేవదాసు, ఉపతహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఎంపీడీవోలు అరుణారెడ్డి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ గ్రామంలోని ఇషా బ్లూమ్స్ కాలనీలో రూ.15 లక్షల సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. పనులు నాణ్యతగా త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచులు నీలం మధు, రవి, మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు.