07-06-2025 06:20:27 PM
మంచిర్యాల (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) మంచిర్యాల నగర కార్పొరేషన్ గర్మిళ్ల జోనల్ కమిటీనీ పట్టణంలోనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దగల శిశు మందిర్ పాఠశాలలో మంచిర్యాల పట్టణ ఇంచార్జి ఎనగందుల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకున్నారు. గర్మిళ్ల జోన్ కమిటీ అధ్యక్షునిగా అమిరిశెట్టి రాజు కుమార్, జోనల్ ప్రధాన కార్యదర్శులుగా నేరేడు కొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణలతో పాటు 35 మందిని కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, నాగేశ్వరరావు, గడ్డం స్వామి రెడ్డి, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.