వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: ఎంపీ రఘునందన్
25-08-2024 03:59 PM
హైదరాబాద్: రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీకెళ్తున్నారని ఆరోపించారు. జిల్లాలో డెండీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. చెరువులు కబ్జాలు చేస్తే ఎవరిపై అయినా చర్యలు తీసుకోండి. హైడ్రా పేరుతో అసలు విషయం పక్కకుపోతుందని ఎంపీ రఘునందన్ విమర్శించారు.






