23-06-2025 01:23:09 AM
- భిన్నంగా మా పార్టీ నేతలు మాట్లాడితే తప్పే..
- కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కారే రక్షణ కవచం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూన్ 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీపై విష ప్రచారం జరుగుతోందని, కాళేశ్వరం విషయంలో ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటలే బీజేపీ విధానం అని కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రా జెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మా రిందని మోదీ చెప్పారని అదే బీజేపీ స్టాండ్ అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్ర భుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మ కం లేదని, ఆ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశా రు.
గత ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని రాహుల్గాంధీ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2 లక్ష కోట్ల అంచనాలకు పెంచిన కేసీఆర్ కుటుం బం వేల కోట్లు దోచుకున్నదని ఆరోపించారు. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్కు భిన్నం గా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా తప్పే, వాళ్ల విష యం హైకమాండ్ చూసుకుంటదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాల నుకోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా ఇంకా ఎందు కు అరెస్ట్ చేయ డం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కానేకాదని, సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపు తున్నాయని విమర్శించారు. కేసీఆర్కు రేవంత్రెడ్డి రక్షణ కవచంగా మారారని, అందుకే కేసీఆర్పై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు.
కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫా రుసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్ఎస్ చెబుతుంటే ఆ ఆధారాలు ఎందుకు బయటపె ట్డడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆధారాలతోసహా ప్రజల ముందుంచాలని కోరా రు. కాళేశ్వరం వల్ల ప్రజాధనాన్ని దోచుకోవ డం తప్ప సాధించిందేముందని నిలదీశారు. కాళేశ్వరం వల్ల భూగర్భజలాలు పెరిగాయి, పంట దిగుబడి పెరిగింది, కాల్వలు నిండాయని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు.
కాళేశ్వరంలో నీళ్లు లేకపోయినా ఈ సీజన్లో రికా ర్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది కదా? మరి దీనికేం సమాధానం చెపుతారని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే ఈపాటికే కేసీఆర్ను, అవినీతిపరులను ఎప్పు డో జైల్లో వేసేవాళ్లమని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పనిలేకుండా కేంద్రమే నేరుగా సీబీఐ తో విచారణ చేయించే అవకాశముంటే కాళేశ్వ రం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈపాటికే వాళ్లను జైల్లో వేసేవాళ్లమన్నారు. బీజేపీ కు టుంబ పార్టీలకు ముమ్మాటికీ వ్యతిరేకమని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబమని స్పష్టం చేశారు. కరీంనగర్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని, కలెక్టర్ తో కూడా మాట్లాడానని, సంబంధిత శాఖ మం త్రి ఉత్తమ్కమార్రెడ్డితోనూ మాట్లాడుతానని చెప్పారు.