23-06-2025 01:21:39 AM
అశ్వాపురం, జూన్ 22 (విజయ క్రాంతి):సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ భూములకు నీరు అందించిన తర్వాతనే బయటకు తీసుకెళ్లాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా అన్నారు.
అశ్వాపురం లో ఆదివారం జరిగిన సిపిఐ మండల 20వ మహాసభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా మాట్లాడుతూ ప్రశ్నించే కమ్యూనిస్టుల పై నరేంద్ర మోదీ, అమిత్ షా కక్ష కట్టి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని దేశ సంపదను మోడీ అమిత్ షా దోచుకుంటున్నారని, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతముందిస్తామని లక్ష్యంగా పెట్టుకునిమరి ఎన్ కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టిం చుకోకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, నారాటి ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, సైరెడ్డి పుల్లారెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మి కుమారి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్,సిపిఐ మండల నాయకులు, అనంతనేనీ సురేష్, అనంతనేనీ శేఖర్, మేలపుర సురేందర్ రెడ్డి, కొండపర్తి ప్రసాద్, రాయపూడి రాజేష్, ఎడెల్లి శీను, తెల్లం వెంకటరమణ,ఈనపల్లి పవన్ సాయి, కమటం సురేష్, అక్కెనపల్లి నాగేంద్రబాబు, దండి నాగేష్, సర్వకృష్ణ, ఏడెల్లి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.