21-07-2025 01:30:10 AM
ఎంపీ ఈటల రాజేందర్
ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్తాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసమైన రాంనగర్ లో బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈయనతో పాటు కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులు హాజరై బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బండారు దత్తాత్రేయ కూతురు, బిజెపి అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ లకు కు పూల బొకేను అందజేసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్, బిజెపి నేతలు తదితరులు పాల్గొన్నారు.