17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

డబల్ బెడ్రూమ్ ల నందు బోర్లు మంజూరు..

19-04-2025 10:53 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ డబల్ బెడ్రూమ్ ల నందు నీటి సమస్య ఉందని మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి కి డబల్ బెడ్రూమ్ వాసులు గత కొన్ని నెలల క్రితం తెలిపారు. ఈ మేరకు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కి మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి నూతన బోర్ల కోసం జనవరిలో ఇచ్చిన అభ్యర్థన మేరకు నూతనంగా 10 లక్షల నిధులతో మూడు బోర్లు మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా డబల్ బెడ్రూమ్ వాసులు మాట్లాడుతూ... బీజేపీ మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి కృషి ద్వారానే ఈరోజు ప్రధాన మంచినీటి సమస్య తీరిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే డబల్ బెడ్రూమ్ లో లిఫ్టులు సరిగా పనిచేయడం లేదని, డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం చూపాలని పీసరి బాలమని కృష్ణారెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏ. మలేష్ యాదవ్, గోనె మల్లారెడ్డి, ఎంబరి ఆంజనేయులు, డి. ప్రభాకర్ రెడ్డి, ఎన్. రోజా, జి. మోహన్ రెడ్డి, ఎం. అతీష్ బాబు, తలారి బాలు, గణేష్, అలిమేలు, నాగమణి, డబల్ బెడ్రూమ్ వాసులు పాల్గొన్నారు.