09-06-2025 01:38:29 AM
నల్లగొండ టౌన్, జూన్ 8: గత నాలుగు రోజులుగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం మహా కుంభాభిషేకం పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం బోనాలు పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణం తో ఉత్సవాలు ముగిశాయి.
బిఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు చెన్నై,తెలంగాణల నుండి వచ్చిన 51 మంది ఋత్వక్కుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అద్యంతము ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు రాజ్యసభ మాజీ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ జెడ్పి మాజీ చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రవీందర్ కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు చకిలం అనిల్ కుమార్, జి వెంకటేశ్వర్లు గోలి అమరేందర్ రెడ్డి బిజెపి నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్ తోపాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు రాజకీయాలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.