09-06-2025 01:37:21 AM
నాగార్జునసాగర్, జూన్ 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ సిఎండి ప్రస్తుతం బుద్ధ వనం మెంటర్( మార్గదర్శి) మహా ఉపాసిక చెన్నూరు ఆంజనేయ రెడ్డి( రిటైర్డ్ ఐపీఎస్) ఆదివారం నాడు బెంగుళూరులోని మహా బోధి బుద్ధ విహార సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఆచార్య బుద్ధ రఖిత అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు.
ఆంధ్ర తెలంగాణలో బౌద్ధ సంస్కృతిని దాని పరిరక్షణ గాను ఎంతగానో కృషి చేస్తున్న మహా ఉపాసిక చెన్నూరు ఆంజనేయ రెడ్డికి బెంగుళూరు మహాబోధి బుద్ధ విహార బిక్కుల సంఘం ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బెంగుళూర్ మహాబోధి బుద్ధ విహార సొసైటీ అధ్యక్షులు మహా కశ్యప తెరో, ప్రధాన కార్యదర్శి ఆనంద బంతే, సుగత నంద, బుద్ధదత్త, మహా బోధి బుద్ధ విహార హైదరాబాద్ అధ్యక్షులు బుద్ధ పాల బంతే మరియు ఆంజనేయ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పర్యాటకంగా, బౌద్ధ సంస్కృతిని పరిరక్షణకు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న మహా ఉపాసక చెన్నూరి ఆంజనేయ రెడ్డి ఇంత గొప్ప అవార్డు అందుకోవడంపై బౌద్ధ అభిమానులు, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, బుద్ధవనం అధికారులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.