calender_icon.png 18 February, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ ఫలితాల్లో మెరిసిన బ్రిలియంట్ విద్యార్థి

18-02-2026 12:47:25 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి17, (విజయక్రాంతి): ఇటీవలే ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో స్థానిక సారపాక బ్రిలియంట్ కాలేజ్ నుండి జాతీయస్థాయిలో 95.98 శాతంతో కె.జయంత్ రెడ్డి భద్రాచలం డివిజన్లో అగ్రగామిగా నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిబి జయంత్ రెడ్డిని, అధ్యాపకులను బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్‌ఆర్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎప్ సెట్ కోచింగ్ కూడా ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా బ్రిలియంట్ విద్యార్థులు టాప్ టెన్ కాలేజీలో మరియు యూనివర్సిటీలో సీట్లు సాధించారని తెలియజేశారు.ఎప్ సెట్ వ్రాయబోవు విద్యార్థులు ముందుగా తమ అప్లికేషన్ పూర్తిచేసుకుని కోచింగ్ తీసుకోవడానికి ఈ నెంబర్లను 9705137128, 9866283566 సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల డైరెక్టర్ కార్తికేయ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.