24-06-2025 12:09:45 AM
అశ్వారావుపేట, జూన్23,(విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజక వర్గ కేంద్రమైన అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ పట్టణ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ధర్నా నిర్వహించారు.
అశ్వారావుపేట పట్టణ బిఆర్ ఎస్ ఆధ్వర్యం లో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి లైట్లు, మంచినీటి సమస్యలు,పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థలు గత ప్రభుత్వంలో ఉన్నా పారిశుధ్యం ఇప్పుడూ ఉన్న పారిశుధ్యం పట్ల తేడా చూసి తక్షణమే ఉన్న సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సిబ్బందికి వినతి పత్రం అందజేసారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి మహిళ నాయకురాలు వగ్గెల.పూజ ,అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్,టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ,పేరాయి గూడెం పార్టీ అధ్యక్షులు బజరయ్య, మందపాటి రాజమోహన్ రెడ్డి, గుర్రాల చెరువు మాజీ సర్పంచ్ కలపాల దుర్గయ్య,నార్లపాటి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.