calender_icon.png 24 June, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైపాస్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

24-06-2025 12:10:33 AM

బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్   

వనపర్తి టౌన్ జూన్ 23: గత ప్రభుత్వ హయాములో ప్రారంభించబడ్డ బైపాస్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశములో గట్టు యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కేంద్రములో పెరుగుతున్న జనాభాకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఒక బృహత్తర ప్రణాళికతో రోడ్ల విస్తరణ చేపట్టి దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చారు.

ప్రభుత్వం మారిన తర్వాత అట్టి బైపాస్ రోడ్డు ఊసుఎత్తకుండా నిర్లక్ష్యం చేయడం మాజీ టి.డి.పి నాయకుడు,నేటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి ప్రయోజనాల కోసం ఎర్త్ వర్క్ అయిన స్థలములో మళ్ళీ మొక్కలు నాటడం ఏమిటని ప్రశ్నించారు.

వెంటనే గత ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే బి.ఆర్.ఎస్ ఆధ్వర్యములో ఉద్యమం చేపడతామని గట్టు యాదవ్ హెచ్చరించారు.ఈ సమావేశములో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, నందిమల్ల. రమేష్, చిట్యాల. రాము పాల్గొన్నారు.