7 April, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

మాపై కేసులు పెడితే భయపడం

29-10-2024 02:06 PM

హైదరాబాద్: మాపై కేసులు పెడితే భయపడం.. రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సు నిర్వహించారు. రైతు ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలను ఆపేశారు.. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. రుణమాఫీ చేయలేదు.. నన్ను రాజీనామా చేయమంటున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు. రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ చేస్తామని పెట్టారు.. కేసీఆర్ ప్రభుత్వంలో అందరికి రుణమాఫీ చేశారని గుర్తుచేశారు.