ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత పెంచాలని బీఆర్ఎస్ ధర్నా
30-06-2026 05:21 PM
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, మరింత పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం కాగజ్నగర్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడి భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.






