9 July, 2026 | 12:15 PM

పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడి దారుణ హత్య..!

09-07-2026 11:01 AM

మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో గ్రామంలో చోటు చేసుకున్న ఘటన

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు

మల్దకల్: గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం వద్ద నిద్రిస్తున్న బోయ మహేష్ (22) అనే యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి  చేరుకున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.