23 June, 2026 | 5:17 PM

Breaking News

బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •  

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా బూడిద గణేష్ ఎన్నిక

23-06-2026 04:30 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మంథనికి చెందిన బూడిద గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం జరిగింది.

ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో శ్రమజీవులు, కార్మికులు మరియు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని, తద్వారా జిల్లాలో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అణగారిన ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, పేద ప్రజల గొంతుకగా వ్యవసాయ కార్మిక సంఘం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

శ్రమ దోపిడీ, బానిసత్వం మరియు కుల వివక్షకు గురవుతున్న వారిని సంఘటితం చేస్తూ, కార్మిక-కర్షక మైత్రి కోసం కృషి చేస్తామని తెలిపారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానంలో సహకరిస్తున్న శ్రేయోభిలాషులు, మేధావులు, అభ్యుదయ వాదులు మరియు పాత్రికేయ మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.