15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎట్టకేలకు తెల్లవారుజామున ఖానాపూర్ నుంచి హైదరాబాదుకు బస్సు సర్వీస్

20-05-2025 03:27 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రం నుంచి కొన్ని సంవత్సరాలుగా తెల్లవారు జామున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు నిర్మల్ డిపో నుంచి బస్సు సర్వీసు ఉండగా, దానిని ఇటీవల రద్దు చేయడంతో ఖానాపూర్, కడం, పెంబి, దస్తురాబాద్, మండలాల ప్రజలు హైదరాబాద్ పట్టణానికి రాకపోకులకు తీవ్ర ఆర్థిక భారం, సమయాభారం, కలిగి నష్టపోతున్న నేపథ్యంలో ప్రజలు ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించాలని డిమాండ్ చేయగా, జగిత్యాల జిల్లా మెట్టుపల్లి డిపో నుంచి ఉదయం 5:15 గంటలకు మంగళవారం నుంచి ఈ సర్వీస్ ను పునరుద్ధరించారు.

వయా మెట్పల్లి నుంచి హైదరాబాద్కు చేరుకునే విధంగా బుదవారం నుంచి ఈ సర్వీస్ ను ప్రారంభించనున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు.కాగా ఈ సర్వీసు ఎక్స్ప్రెస్ సర్వీస్ వేసి మహాలక్ష్మి పథకం మహిళ లకు , ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజధానికి ఉదయం బస్సు సర్వీసు నిర్మల్ డిపో కాకుండా మెట్పల్లి డిపో నుంచి వేయడం ప్రజలు హర్షిస్తున్నారు.