calender_icon.png 23 June, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు క్యాబినెట్ భేటీ

23-06-2025 01:07:07 AM

- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

- ‘బనకచర్ల’ కార్యాచరణపై ప్రధానంగా చర్చ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రే వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంత్రి వర్గం భేటీ కానున్నది. సీఎం ఈ భేటీలో  పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిసింది.

ఇదే అంశంపై సర్కార్ ఇటీవల అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు అం దజేశారు.

మంత్రివర్గ భేటీలో బనకచర్లపై మున్ముందు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే నిర్ణయానికి వస్తారని తెలిసింది. అలాగే రైతుభరోసా అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఫోన్‌ట్యాపింగ్ కేసు పూర్వాపరాలపైనా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.