17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేడు క్యాబినెట్ భేటీ

23-06-2025 01:07 AM

- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

- ‘బనకచర్ల’ కార్యాచరణపై ప్రధానంగా చర్చ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రే వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంత్రి వర్గం భేటీ కానున్నది. సీఎం ఈ భేటీలో  పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిసింది.

ఇదే అంశంపై సర్కార్ ఇటీవల అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు అం దజేశారు.

మంత్రివర్గ భేటీలో బనకచర్లపై మున్ముందు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే నిర్ణయానికి వస్తారని తెలిసింది. అలాగే రైతుభరోసా అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఫోన్‌ట్యాపింగ్ కేసు పూర్వాపరాలపైనా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.