23-06-2025 01:08:58 AM
- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ధాన్యం టెండర్ల కుంభకో ణంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ మాజీ ఎమెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమా వేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నలుగు రు బిడ్డర్స్ మాత్రమే టెండర్లలో పా ల్గొన్నారని, క్వింటాల్ వడ్లకు రూ. 2007 ధర నిర్ణయించారని, ఇప్పటి వరకు ధాన్యం లిఫ్ట్ చేయకుండా మి ల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.
మిల్లర్ల నుంచి బిడ్డర్ల అకౌంట్లలోకి నగదు బదిలీ అయిందని, రూ.1,100 కోట్ల మేర కుంభ కోణం జరిగిందని సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బును సివిల్ సప్లుసై ఖాతాలోకి జమచేయాలని, లేదంటే సివిల్ సప్లుసై భవన్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. త్వరలో సివిల్ సప్లుసై అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సివిల్ సప్లుసై అవినీతిపై ప్రభుత్వం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. 270 బ్యాంకు ఖాతాలు సేకరించి సీఎం, సివిల్ సప్లుసై మంత్రికి, సివిల్ సప్లుసై కమిషనర్కు పంపామన్నారు. క్విం టాల్కు రూ.2,007లకు బదులు రూ.2,230 లు వసూలు చేశారన్నారు.