16 July, 2026 | 2:46 PM

Breaking News

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం   •   స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి   •   నీటి విడుదల కోసం రైతుల ధర్నా   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి   •   వర్షం కోసం రైతుల పూజలు   •   జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •  

క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు

22-12-2024 01:32 AM

బెర్లిన్, డిసెంబర్ 21: జర్మనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మాగ్డేబర్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 5గురు చనిపోగా 200 మందికి గాయాలయ్యాయి. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్రిస్మస్ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి అరేబియాకు చెందిన తలేబ్‌ను జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కొన్నేండ్లుగా జర్మనీలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ సైతం ఈ ఘటనపై స్పందించింది. ‘జర్మనీలో జరిగిన హింసను ఖండిస్తు న్నాం. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మస్క్ స్పందిస్తూ జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.