22-06-2025 01:54:39 PM
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై(Vijay Devarakonda) కేసు నమోదు అయింది. నటుడు విజయ్ దేవరకొండపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల నేతలు రాయదుర్గం పీఎస్(Raidurgam Police Station)లో కేసు పెట్టారు. సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.