15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి

16-06-2025 12:06 AM

గద్వాల్ టౌన్ జూన్ 15: గట్టు మండలం ముచ్చోని పల్లి రిజర్వాయర్ క్రింద 5 కిలోమీటర్ల మేర వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా వేసి అవినీతికి పాల్పడ్డారని అందుకు కారకులు అయిన కాంట్రాక్టర్, పర్యవేక్షణ లేని సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయాలనీ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ అన్నారు.

ఆదివారం సభ్యులతో కలిసి ఆయన బి టి రోడ్డు ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గద్వాల నియోజకవర్గంలో అడుగడుగునా నాసిరకమైన బీటీ రోడ్లు, సిసి రోడ్లు వేసి ప్రజానాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు .ఈ విషయం పై సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పుట్ట ప్రసాద్,కృపాకర్ మార్క్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.