16-06-2025 12:06:37 AM
మంథని వ్యవసాయ సహాయ సంచకులు అంజని
మంథని, జూన్ 15 (విజయక్రాంతి) రైతులకు పెట్టుబడి సాయం గా రైతు భరోసా విడుదల కార్యక్రమం తెలంగాణ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరి నుం డి ప్రత్యక్ష ప్రసారం సోమవారం ఉంటుందని మంథని వ్యవసాయ సహాయ సంచ కులు అంజని మిశ్ర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రైతు భరోసా కి సం బంధించిన విధివిధానాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో వివరిస్తారని, అందుబాటు లో ఉన్న రైతులందరూ తమ తమ దగ్గరలో గల రైతు వేదికల వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వీక్షించగలరని ఆమె సూచించారు. రైతు భరోసా దరఖాస్తు చేయని రైతులు కొత్త పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి నెల 20 లోపు సమర్పించగలరనిఆమెతెలిపారు.