16-06-2025 12:04:42 AM
చిగురుమామిడి, జూన్ 15(విజయక్రాంతి): మండలంలోని నవాబుపేట ప్రభు త్వ పాఠశాల 1999-2000వ 10వ తరగతికి చెందిన దాదాపు 70మంది పూర్వ విద్యార్థులు 25సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై ఆదివారం కలిశారు. పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు.గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. నాటి గురువులకు శాలువాలు కప్పి మెమొంటో లు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు రాజిరెడ్డి, లింగారెడ్డి, హరికిషన్, అంజిరెడ్డి, శ్రీవాణి, పూర్వ విద్యార్థులుపాల్గొన్నారు.