22-06-2025 12:00:06 AM
- 800 కోట్ల స్కామ్లో కేసు నమోదు
- మూడేండ్ల పాటు ప్రాథమికంగా విచారణ
న్యూఢిల్లీ, జూన్ 21: టాటా కన్సెల్టింగ్ గ్రూపు (టీసీఈ), జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ), రెండు డ్రెడ్జింగ్ కంపెనీలకు చెందిన పలువురు మాజీ అధికారులు రూ. 800 కోట్ల మోసానికి పాల్పడినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)అభియోగాలు మోపింది. గ్లోబల్ మారిటైమ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన బోస్కలిస్ స్మిత్ పేరును కూడా ఈ కేసులో చేర్చింది. డ్రెడ్జింగ్ పనులు రెండు విడతల్లో పూర్తి చేయగా.. 2010 నుంచి 2014 వరకు ఫేస్ధి 2012 నుంచి 2019 వరకు ఫేస్ణౌ పనులు పూర్తి చేశారు.
ఈ పనుల్లో కొన్ని ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చేలా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ విషయంపై సీబీఐ మూడేండ్ల పాటు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేసింది. సీబీఐ తన ఎఫ్ఐఆర్లో జేఎన్పీటీ చీఫ్ ఇంజినీర్ సునీల్ కుమార్ మాదభవీ, టీసీఈ ప్రాజెక్టు డైరెక్టర్ దేవ్దత్ బోస్, బోస్కలిస్ స్మిత్ ఇండియా ఎల్ఎల్పీ ఇంకా మరికొంత మందిపై ఐపీసీ సెక్షన్ 120 420 మరిన్ని ఇతర సెక్షన్ల మీద కేసు నమోదు చేసింది.
బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముంబై, చెన్నైలోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. మాదభవీ ఇండ్లు, బోస్, ఇతర ప్రైవేటు కంపెనీల ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో క్యాపిటల్ డ్రెడ్జ్ ప్రాజెక్టుకు చెందిన చాలా పత్రాలు లభించినట్టు సీబీఐకి చెందిన కొంత మంది అధికారులు పేర్కొన్నారు. పత్రాలతో పాటు డిజిటల్ పరికరాలు, పెట్టుబడుల ఒప్పందాలు మొదలయినవి లభించాయి.