calender_icon.png 22 June, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ ఫుటేజీ ఇవ్వలేం

22-06-2025 12:03:37 AM

- దానివల్ల ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుంది: ఈసీ

- కుదరదన్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ, జూన్ 21: మహా ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఏకీకృత, డిజిటల్ ఓటర్ జాబితా, అంతే కాకుండా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధిం చి సాయంత్రం 5 గంటల తర్వాత ఓటేసిన వారి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు ఎన్నికల సంఘం శనివారంనో చెప్పింది. పోలింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజీని బయటకు ఇవ్వడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని వాదిం చింది. ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతృత్వం లోని మహాయుతి రిగ్గింగ్‌కు పాల్పడిందని రాహుల్‌గాంధీ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. 

ఓటేసిన వారు, వేయని వారు బెదిరింపులకు గురవుతారు.. 

పోలింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజీని బయటకు ఇవ్వడం ఓటేసిన వారితో పాటు వేయని వారు బెదిరింపులకు గురవుతారని ఈసీ అభ్యంతరం తెలిపింది. ‘పోలింగ్ బూత్ ఫుటేజీ పంచుకోవడం వల్ల అనేక ఇబ్బం దులు తలెత్తుతాయి. ఓటేసిన వారు, వే యవారెవరో తెలిసిపోతుంది. ఓటేయని వారు వివక్షకు, ఒత్తిడికి గురయ్యే ప్ర మాదం ఉంది. ఓటేయని వారితో ఓటు వేసిన వారు కూడా బెదిరింపులకు లోనవుతారు. ఈవీడి యోలు అంతర్గత పర్యవేక్షణకు మాత్రమే. ఎన్నికలకు సంబంధించి ఏదైనా కేసులో కోర్టులు కోరితే మాత్రమే ఫుటేజీ అందిస్తాం.’ అని ఈసీ తెలిపింది.