18 April, 2026 | 12:57 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

నాణ్యతతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలి

29-03-2025 08:25 PM

గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

ఎల్బీనగర్: గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా సీసీరోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, కాలనీ వాసులు రమేశ్, శ్యామ్, బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ దాసరి జయ ప్రకాశ్, నాయకులు సతీశ్, రఘునందన్ జోషి, టీంకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.