వ్యవస్థనే మార్చాలి
23-05-2024 12:03 AM
తెలంగాణలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏసీబీ దాడుల్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కోట్లకొద్దీ అక్రమ ఆస్తులు సంపాదించినట్లు బైటపడింది. గతంలో కూడా సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఓ ప్రముఖ రియల్టీ సంస్థ అక్రమాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. విచిత్రమేమంటే అవినీతి కేసుల్లో పట్టుబడే ప్రతి అధికారి వద్దా కోట్ల కొద్దీ అక్రమ ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఒకరో, ఇద్దరో అధికారులను పట్టుకుంటే లాభం ఉండదు. వ్యవస్థలోనే మార్పు తీసుకురావాలి.
- జి. సూర్యప్రకాశ్ రావు, కోదాడ






