7 July, 2026 | 12:56 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

పంట పొలాల్లో సీసీ కెమెరాలు..

25-03-2025 08:40 PM

బూర్గంపాడు/అశ్వాపురం (విజయక్రాంతి): ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధుల్లో, దుకాణాల్లో, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే సాంకేతిక సాధనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన మహిళా రైతు పడిదం వరలక్ష్మి తన కూరగాయలు చేనులో దొంగల భారీ నుండి తప్పించుకునేందుకు తన కూరగాయలు పండించే వ్యవసాయ పొలంలో సోలార్ తో సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళ రైతు పడిదం వరలక్ష్మి మాట్లాడుతూ.. నీళ్ల మోటర్ ను, దిగుబడి వచ్చే సమయంలో కొందరు దొంగలు పంటను ఎత్తుకెళుతున్నారని దీంతో నష్టపోతున్నమని, వారి నుంచి పంటను కాపాడుకునేందుకు పొలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి పంటను రక్షించుకుంటున్నామని తెలిపారు.