26-06-2025 10:47:07 PM
ముమ్మరంగా ఇళ్లకు ముగ్గులు..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గురువారం సంబరాలను నిర్వహించుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశం మేరకు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసుకొని ముగ్గులను పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, 60వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనుకొంటి పున్నం చందర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనగాం శ్రీనివాస్ గౌడ్, మిడిదొడ్డి శేఖర్, పిట్టల వంశీ, బోడ ప్రసాద్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్ కుమార్ తోపాటు హౌసింగ్ ఏఈ నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.