calender_icon.png 27 June, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యాన్ని తొక్కిన పార్టీకి మాట్లాడే హక్కు లేదు

26-06-2025 10:45:13 PM

మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్..

ఖమ్మం (విజయక్రాంతి): “చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తూ ఉండదు. ప్రజాస్వామ్యం అనేది ఓటు వేయడం మాత్రమే కాదు, అది హక్కుల పరిరక్షణ. అలాంటి ప్రజాస్వామ్యాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీనే తొక్కింది, అలాంటి పార్టీ నాయకులు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం గొప్ప దురాశ” అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్(MP Etela Rajendar) విమర్శించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎంపీ ఈటెల ఖమ్మం జిల్లా పర్యటన చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం వీడియోస్ కాలనీలోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

1975లో ఇండిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ గురించి ప్రస్తావిస్తూ, ‘‘అది దేశ ప్రజల గొంతు నులిమిన రోజు. ఆ రోజు దేశ రాజ్యాంగం నిలిపివేయబడింది. ఆ రోజు ప్రజలపై విచక్షణా రహిత అరెస్టులు జరిగాయి. అప్పటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని కాలరాసారు. అలాంటి పార్టీకి – అదే కాంగ్రెస్ పార్టీకి – ఇప్పుడు రాజ్యాంగం మీద మాట్లాడే నైతిక హక్కే లేదు’’ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు తాండ వినోద్ రావు, నున్నా రవి కుమార్, దేవకీ వాసుదేవరావు, గోంగూర వెంకటేశ్వర్లు, సన్నీ ఉదయ ప్రతాప్, ఇవి రమేష్, పుల్లారావు యాదవ్, గెంటేల విద్యాసాగర్, దొంగలు సత్యనారాయణ, విజయరాజు, శ్యామ్ రాథోడ్, తడుపునూరి రవీందర్, నెల్లూరు బెనర్జీ, సుదర్శన్ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.