01-06-2025 09:01:56 AM
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం: రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలి మెడలోంచి బంగారు పుస్తెలతాడను(Chain snatching) గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (70), ఇబ్రహీంపట్నం మంచాల్ రోడ్డులో ఉదయం ఆకుకూరల మార్కెట్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలోంచి సుమారు 3 తులాల పుస్తెలతాడను గుర్తు తెలియని దుండగులు అపహరించి అక్కడి నుంచి ఊడయించారు. చోరీకి పాల్పడిన వారు కారులో వచ్చినట్లు సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.