01-06-2025 01:40:30 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): హైదరాబాద్లో జరిగిన మిస్వరల్డ్-౨౦౨౫ అందాల పోటీల్లో మేఘా కంపెనీ డైరెక్టర్ సుధారెడ్డి కీలకంగా వ్యవహరించారు. పోటీలకు ఆమె స్పాన్సరర్గాను వ్యవహరించారు. ‘బ్యూటీ విత్ పర్పస్’ పేరుతో తన ఇంట్లో ప్రపంచ సుందరీమణులు, నిర్వాహకులకు విందు ఇచ్చారు.
సీఈవో జూలియామోర్లీ ఆ సేవలను గుర్తించి సుధారెడ్డిని ‘మిస్వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్’గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అందాల పో టీల ఫైనల్స్లో సీఈవో జూలియా మోర్లీ, నటుడు సోనూసూద్తోపాటు సుధారెడ్డి కూడా న్యాయ నిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తించారు. సుధారెడ్డి గతంలోనూ అనేక ఫ్యా షన్ షోలకు స్పాన్సరర్గా వ్యవహరించారు.