15 June, 2026 | 7:13 PM

Breaking News

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •  

పవన్‌ కల్యాణ్‌ని తెలంగాణలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు

03-06-2026 05:00 PM

అమరావతి: తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం(Pawan Kalyan meeting ) అడ్డుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తెలిపారు. ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీ పడాలని,ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు నేతలు పోటీపడకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

తాను కూడా ఇటీవల తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశానని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్‌ యూనిట్‌ పెట్టిందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందన్న చంద్రబాబు ఎవరెవరు ఏం చేశారు ప్రజలకు తెలుసన్నారు. లాజికల్‌గా ముందుకెళ్లాలి తప్ప.. ప్రశాంత వాతావరణం చెడగొట్టడం సరికాదని ఏపీ సీఎం స్పష్టం చేశారు.