calender_icon.png 10 June, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు నెరవేర్చని ఉట్టి మాటల కాంగ్రెస్ పార్టీ

09-06-2025 08:20:47 PM

తాసిల్దారుకి మెమోరండం అందజేసిన చర్ల మండల పార్టీ నాయకులు

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు(BRS Party President Rega Kantha Rao) ఆదేశాల మేరకు మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును  ఖమ్మం జిల్లాలో  సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించుకొని పోవుచున్నారు, ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సరైనదే కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీటి అందించకపోవడం దుర్మార్గం అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించవలనీ రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డుల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయక సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సోయాం రాజారావు మాజీ ఎంపీపీ గీద కోదండ రామయ్య మండల సీనియర్ నాయకులు సయ్యాద్ అజీజ్ ఎడ్ల రామదాసు డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వర రావు ఎస్ టి సెల్ కార్యదర్శి కారం కన్నారావ్ ఎస్ సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము యూత్ మండల అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ మహిళా విభాగం ఉపాద్యక్షురాలు కుప్పల సౌజన్య యూత్ నాయకులు కట్టాం కన్నారావు తడికల బుల్లెబయి మెడబత్తిని గోవర్ధన్ తోటపల్లి సాయి కోటి శ్రీకాంత్  బట్ట కొమరయ్య మునిగేలా సాంబ తడికల చంద్రశేఖర్ గట్టుపల్లి రాజు కారం రామారావు గట్టుపల్లీ రామయ్య మైపా వెంకటేశ్వర్లు తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.