30-06-2025 12:06:08 AM
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం జూన్ 29 (విజయ క్రాంతి) నిరుద్యోగులైన గిరిజన యువతులు ప్రపంచంలో డిమాండ్ ను బట్టి వ్యాపా రం ఎంచుకొని, నష్టపోకుండా అధిక లాభాలు సాధించేలా జీవనోపాధి పెంపొందించు కోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఐటిడిఏ ప్రాంగణంలోని వై టి సి లో గిరిజన యువతులు కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహు ల్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ తో కలిసి యువతులకు వ్యాపా రం లోని మెలకువలు, సలహాలు, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ గ్రామాలలోని మ హిళల డిమాండ్ ను బట్టి బట్టలు డిజైనింగ్ చేయాలని, మహిళలందరూ ఐకమత్యంగా ఉండి ముక్కోటి శ్రీరామనవమి పం డుగల సమయంలో మీరు తయారు చేసిన డిజైన్లను అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తానని,కుట్టు శిక్షణ నేర్చుకు న్న యువతులకు హైదరాబాద్ పంపించి బొంబాయి , పూణే రాష్ట్రాల నుండి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ తో మమేకం చేసి కొ త్త కొత్త డిజైన్లు తయారు చేసే విధంగా శిక్షణలు ఇప్పిస్తామన్నారు. హైదరాబాదులోనీ శిల్పారామంలో ప్రత్యేకంగా మీరు తయారు చేసిన డిజైన్ల బట్టలను అమ్ముకునే వెసులబాటు కల్పిస్తానన్నారు.
ఉత్సాహవంతులైన మహిళలకు మీ గ్రామంలోని అంగన్వాడి సెంటర్, ప్రభుత్వ పాఠశాలల పక్కన కుట్టుమిషన్లకు సం బంధించిన వర్క్ షెడ్డు ఈజీఎస్ ద్వారా కట్టించుకొని ఇటు పిల్లల ఆలనా పాలన, మీరూ బట్టలు కుట్టుకునీ వ్యాపారం చే సుకోవచ్చన్నారు.
కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు క్లస్టర్ వారిగా గ్రూప్స్ తయారు చేయించి మూడు క్లస్టర్లకు కలిపి ఎం బ్రాయిడరీ కి సంబంధించిన పెద్ద మిషన్ ఇప్పించడానికి కృషి చేస్తానని మహిళ లందరూ ఎంబ్రాయిడరింగ్ శిక్షణ తీసుకొని నిష్ణాతులు కావాలని అన్నారు.
అనంతరం పిఎంఆర్సి కార్యాలయం సందర్శించి కార్యాలయంలో గిరిజనులకు సంబంధించిన అన్ని రకాల సంక్షేమ ప థకాల పెయింటింగ్ డిజైనింగ్ వేయించాలని, ముఖ్యంగా గిరిజనులకు పంపిణీ చేసే సంక్షేమ పథకాలు పోడు భూములకు సంబంధించిన జాబితా, నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణలు ఇప్పించే జాబితా ,గిరిజనులకు అన్ని విధాల ఉపయో గపడే అన్ని జాబితాలు రూపొందించి ప్రదర్శించాలని అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి ము ఖ్యంగా విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ పనులు, టాయిలెట్స్ బాత్రూమ్స్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పనులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
శ్రీరామ జాయింట్ లియాబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూని ట్ ని సంప్రదించి ఇక్కడ తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఐటీడీఏ భద్రాచలం పేరును భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఎటువంటి కల్తీ లేని ఆర్గానిక్ తినుబం డారాలు తయారు చేసి మ్యూజియం , దేవస్థానం కు వచ్చే భ క్తులకు అందించాలన్నారు.
మిల్లెట్ బిస్కెట్లు తయారీ కొరకు కొనుగోలు చేసే ముడి సరుకుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు, నెయ్యి ఇతర వస్తువులు బయట నుండి కాకుండా మన పంట పొలాలలో రాగులు, సజ్జలు పండించుకొవాలని, నెయ్యిని మాత్రం మన గ్రామాలలోనే పశుసంపద ఎక్కువగా ఉన్నందున స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
అలాగే మిల్లెట్ బిస్కెట్లకు సంబంధించిన బ్రాం డింగ్ స్టిక్కర్లు సెలెక్ట్ చేసి ఐటిడిఏకు మంచి గుర్తింపువచ్చేలా చూడాలని అన్నారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీ గ్రూ ప్ మహిళలు ప్రపంచమంతట భద్రాచలం ఐటిడిఏ తరపున మిల్లెట్ బిస్కెట్ల తయారీకి సంబంధించిన అంశం ప్రధానమం త్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పిఓ ఛాంబర్ లో ఐటీడీఏ పీవో బి రాహు ల్, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్,
శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ లకు మిల్లెట్ బిస్కెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఏసీఎంవో రమేష్, టి ఏ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ ఐ నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ త యారీ మహిళలు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.