30-06-2025 12:08:19 AM
ఫిర్యాదు చేసిన పట్టించుకోని పంచాయతీ అధికారులు
ఎక్కడి చెత్త అక్కడే.. కానరాని పంచాయతీ అధికారులు
క్షీణిస్తున్న పారిశుధ్య నిర్వహణతో అనారోగ్యాల బారిన ప్రజలు
పారిశుద్ధ్య నిర్వహణా గగనమే
మణుగూరు, జూన్ 29 (విజయ క్రాంతి): పేరులోనే సింగారంగా ఉన్న సమితి సింగారం పంచాయతీలో అధికారుల పర్యవేక్షణ కొరవర డటంతో ఎక్కడ చెత్త అక్కడే రోడ్లపై పేరుకు పోయి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణంలో భాగమై మేజర్ పంచా యతీగా ఉన్న పంచాయతీలో ప్రజలను స మస్యలు పట్టి పీడిస్తున్నా.. పాలన అస్తవ్యస్తం గా ఉన్నా చూసే వారే కరువయ్యారు.
పలు కార్యక్రమాల పేరుతో అభివృద్ధి చేస్తున్నామ ని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్న వా టికి భిన్నంగా పంచాయతీలో పరిస్థితి కనిపిస్తోంది. కనీసం మురుగు కాలువలను కూ డా శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండల, గ్రామ స్థాయి అధికారులు పట్టించుకోక పోవడంతో పంచాయతీలో పలు ప్రాంతాలలో అ పారిశుధ్యం విళయతాండవం చేస్తుందని తద్వా రా దోమలు వృద్ధిచెంది అనారోగ్యం పాలవుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
ము ఖ్యంగా ఎన్టీఆర్ నగర్, పోలీస్ కాలనీ, సాయి నగర్, అశోక్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ఏరియాలలో చినుకుపడితే వీధు లన్నీ మురుగు మయంగా మారుతున్నాయి. డ్రైనేజీ కాలువల్లో చెత్త,మురుగు తొలగించకపోవడం వ ల్ల ఆయా ప్రాంతాలలో చిన్నపాటి చినుకు పడితే చాలు కాలువలలోని మురుగు నీరు రోడ్డు పై ప్రవహిస్త దుర్వాసన వెదజల్లుతోంది. కాలువలలోని మురుగు రోడ్లు పైకి రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపం తో పలు కాలనీలలో మురుగు నీటి కాలువలు దారుణంగా తయారయ్యాయి . కనీ సం శానిటేషన్ సిబ్బంది పని చేస్తు
న్నారా, లేదా అనే అను మానం వచ్చేలా మురుగు కాలువలు దర్శనమిస్తున్నాయి. కా లువల్లో చెత్త,చెదారంతోపాటు ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో దోమలకు నిలయాలుగా మారాయి . వర్ష కాలంలో విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయా కాలనీ వా సులు భయపడుతున్నారు. ఈ దోమలకు భయపడి రాత్రి వేళల్లో దోమల మందులతో పాటు, దోమ తెరలు ఉపయోగి స్తున్నామని గ్రామస్తులు చెబుతు న్నారు.
ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం పంచాయతీ ప్ర త్యేక అధికారి, సిబ్బంది కానీ చూసి చూడనట్టుగా వ్యవహరి స్తున్నారని గ్రామ పరిశు భ్రత గూర్చి పంచాయతీ అధికారుల కు సంబంధం లేనట్టుగా ఉంటు న్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి చెత్త అక్కడే..
దుర్వాసనతో రాజీవ్ గాంధీ నగర్ సాయి నగర్, ఏరియాలో కంపు కొడుతోంది. కాలువలు సక్రమంగా లేకపోవడంతో..రోడ్డు పైనే మురికి నీరు చేరి రాజీవ్ గాంధీనగర్ సమస్యలతో ఆల్మటిస్తుంది. పలు వీధులలో రోడ్ల పైనే మురుగు పారుతూ దుర్వాసన వెదజల్లుతోంది. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపో వడంతో రహదారులపై మురుగు నిలుస్తుండటంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే దోమల బెడద క్రమే పీ పెరుగుతోంది. దీంతో స్థానికులు తీవ్రం గా ఇబ్బందులు ఎదుర్కొంటు రోగాల భారి న పడుతున్నారు. కాలనీ లలో వేసిన చెత్త కు ప్పలను పరిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తర లించాల్సి ఉంది. కానీ కూడలి లలో పారిశుద్ధ్య కార్మికులు ట్రా క్టర్లతో చెత్తా చెదారాన్ని తొలగించకుండా ని ర్లక్ష్యంగా పంచాయతీ సిబ్బంది రోడ్లపైనే చెత్తను వదిలేస్తున్నారు. దీంతో ఆయా ప్రాం తాలుఅపరిశుభ్రత తో దర్శనమిస్తున్నాయి.
పడకేసిన పాలన...
పంచాయతీలో ప్రత్యేకాధి కారుల పాలన పడకేసింది. ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం ఇతర బాధ్యతలను అప్పగించడం తో, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారి పో యింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీ లు, పారి శుధ్యంపై పర్య వేక్షణ కొరవడడం తో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.
చెరువులను తలపిస్తున మురుగునీటి కాలువలు
రాజీవ్ గాంధీ నగర్ లో ఓ ప్రైవేట్ పాఠశాల నుండి వచ్చే నీటితో ఓ మురుగునీటి కాలువ చెరువును తలపిస్తుంది. దోమల కు అడ్డాగా మారింది. చాలా కాలంగా మురు గు తొలగించకపోవడంతో మొత్తం నాచులా తయారై ఉంది. మురుగు కాలువల వల్లే గతంలో ఈ కాలనీలో కొందరు విష జ్వరాల బారిన పడి మృతి చెందారు. ఇంత జరిగినా మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయిన పంచాయతీ అధికారులు మాత్రం కాలువలను శు భ్రం చేయడం లేదని,
గ్రామస్తు లు పలుమార్లు పంచాయతీ అధికారులకి తెలియజే సినప్పటికీ పట్టించుకోవడం లేదని,నెలలు తరబడి కాలువలను శుభ్రం చేయకపోవడం తో మురుగు కంపు కొడుతోందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మురుగు నీటిలో పందులు హల్ చల్ చేస్తున్నాయని, కనీసం పంచాయతీ సిబ్బంది చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
కనీస పారిశుధ్య నిర్వహణ కరువే..పంచాయతీలో వారం రోజుల కొకసారి కూడా పారి శుధ్య మెరుగుదల చర్యలు చేపట్టడం లేదంటే పరిస్థితిపై ఒకసారి దృష్టి సారించాల్సి ఉంది. దీనికి అధికారులు పెద్దగా దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి పంచాయతీలోని వీధు ల్లో పర్యటిస్తే చాలు.. పారిశుధ్య మెరుగుదల ఎలా ఉందనేది అర్ధమైపోతోంది.ఈ నేపథ్యంలో ప్రత్యేకాధికారి ఎంపీ ఓ,వెంకటే
శ్వరరావు, పంచాయతీ అధికారులు స్పం దించి సమస్యలపై దృష్టి సారించాలని, డ్రైనేజీలను క్లీన్ చేయించి దుర్వాసన వెద జల్ల కుండా చూడకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని రాజీవ్ గాంధీ నగర్ వా సులు పేర్కొంటున్నారు. మరోవైపు సమితి సింగారం పంచాయతీకి ప్రత్యేక అధికారి ఎంపీవో కావటం విశేషం. ఈ కాలనీలలో ప్రత్యేక అధికారి,పంచాయతీ కార్యదర్శి,
సి బ్బంది సమయం కేటాయించి పారిశుద్ధ్య నిర్వహ ణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించా లని, తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికు లు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావును వివరణ కోరగా రెండు మూడు రోజులలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.