30-06-2025 12:04:13 AM
వైరా, జూన్ 29 (విజయక్రాంతి) కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక సే వా కార్యక్రమాలు నిర్వహించాలని, సామాజిక వర్గంలో పేదల అభివృద్ధికి కృషి చేయా లని మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సూచించారు.ఖమ్మం జిల్లా వైరా ని యోజకవర్గ కేంద్రంలో కమ్మ జన సేవా సమితి సర్వసభ్య సమావేశం ఆదివారం ని ర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కమ్మ జనసేవా సమితి ఫౌండర్ అడపా అప్పారావు ప్రము ఖ న్యాయవాది కాటంనేని రమేష్ మంద డపు మధుసూదన్ రావు ఈ ఐదుగురు హా జరై వారి సమన్వయంతో కళ్యాణ మండపం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సం దర్భంగా కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపం అధ్యక్షులుగా కట్టా కృష్ణార్జున రా వు ఉపాధ్యక్షులుగా మేదరమెట్ల శ్రీనివాసరా వు ప్రధాన కార్యదర్శిగా చింత నిప్పు రాంబాబు జాయింట్ సెక్రటరీగా సూర్యదేవర శ్రీధర్ కోశాధికారి ఏనుగు హనుమంతు రావులను ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమం లో కమ్మ జన సేవా సమితి నిర్వాహకులు కట్టా కృష్ణార్జున రావు మేదరమెట్ల శ్రీనివాసరావు చింత నిప్పు రాంబాబు చింతనిప్పు వెంకటయ్య శ్రీరామ నేని రామస్వామి, కమ్మ జన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.