07-02-2026 01:53:00 PM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) గజ్వేల్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉద్రికత్త నెలకొంది. గజ్వేల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రచారానికి రావటానికి ముందు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గజ్వేల్ లో దాడులకు దిగిన ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.