02-06-2025 04:01:55 PM
నార్సింగి/చేగుంట,(విజయక్రాంతి): నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, పక్షాలు పట్టు పట్టి జెండా ఆవిష్కరణను అడ్డుకున్నారు. జెండా గతం నుంచి భవనంపై ఎగుర వేసామని, ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తామని బీఆర్ఎస్ పక్షం భవనం ముందు భాగంలో భూమిపై ఎగుర వేయాలని, భవనంపై జెండా ఆవిష్కరణ చేస్తే పెద్దలు, భవనంపై ఎలా ఎక్కుతారని, లేకపోతే కార్యక్రమాన్ని బాయ కాట్ చేస్తామని కాంగ్రెస్ పక్షం వారు పట్టు పట్టడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ 8:30 కు చేయాలని అనుకున్నా రాజకీయ పరిణామాల వల్ల 9:30 దాటినా జెండా ఆవిష్కరణ జరగలేదు. పంచాయితీ కార్యదర్శి కార్యక్రమాన్ని సజావుగా సాగించడానికి పై అధికారుల తో సంప్రదింపులు జరిపి ఇరు పక్షాలకు సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు. జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయురాలు పాఠశాలలు తీసుకుని వెళ్ళిపోయారు. 9:45 వరకు కూడా గ్రామంలో ఎక్కడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించలేదు.