calender_icon.png 4 June, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు

02-06-2025 03:53:07 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పార్టీ కోసం పని చేసే వారికీ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) అన్నారు.  బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం(Road Accident)లో మృతి చెందారు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం(BRS Party Membership) పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద రూ.2 లక్షల చెక్కును మంజూరు చేపించి సోమవారం ఆ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.