రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
19-08-2024 10:26 AM
హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజల ప్రభుత్వం మహిళా సంఘం సాధికారత వారిని లక్షాధికారులుగా ప్రోత్సహించే లక్ష్యంతో అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేసిందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.






