18-06-2025 10:42:03 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి(CM Revanth Reddy Delhi Tour) వెళ్లనున్నారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపికపై చర్చించే అవకాశముంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని, ఇతర అధికారులను సీఎం కలిసే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.