02-06-2025 08:21:08 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana State Formation Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయ సాధన కోసం అందరం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.. అమరుల త్యాగాలు చిరస్మరణీయం.. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. సోమవారం ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం(Telangana Martyrs' Memorial) వద్ద సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Secunderabad Parade Grounds)లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తోంది. వేడుకలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. పోలీసులకు మెడల్స్ ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకలకు మఖ్య అతిథిగా జపాన్ లోని కితా క్యూషా సిటీ మేయర్(Kitakyushu City Mayor Kazuhisa Takeuchi ) రానున్నారు