02-06-2025 08:46:13 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు(Telangana Formation Day) తెలిపారు. తెలంగాణ(Telangana) ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ శక్తివంతమైన పర్యాటక వ్యవస్థ కలిగి ఉందని ద్రౌపది ముర్ము వెల్లడించారు. తెలంగాణ ప్రజలు(People of Telangana) పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుతున్నానని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
''రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను.'' అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ లో పేర్కొన్నారు.