20న సీఎం మేడిగడ్డ పరిశీలన
16-04-2026 01:11 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 20వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు






