22-07-2025 11:43:07 PM
రూ.లక్ష 50 వేల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరు: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. పటాన్ చెరు మండలం లకడారం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ఒక లక్ష 50 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు అయింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెహమాన్ కుటుంబ సభ్యులకు ఎల్ఓసి అనుమతి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.