23-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, జూలై 22 (విజయక్రాంతి): మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లా కి సంబందించి...ఇప్పటి వరకు ఆర్టీసీ లో 2.26 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ ప్రయాణం వలన.. 108.97 కోట్ల ఆదాయం ఆర్టీసీ కి సమాకూరిందని...ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2023 డిసెంబర్ 9వ తేదీ నుండి విజయవంతంగా అమలవుతోందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని... బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు